ఇద్దరు కార్యకర్తల దారుణ హత్య

by  |
ఇద్దరు కార్యకర్తల దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళలో రాజకీయ హత్యలు కలకలం రేపాయి. వెంజరమూడు గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) కార్యకర్తలు మిథిల్ రాజ్ (32), హక్ మహ్మద్ (24)పై ఆదివారం మధ్యాహ్నం ప్రత్యర్థులు గొడ్డళ్లతో దాడి చేయగా… మిథిల్ రాజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కొన ఊపిరితో ఉన్న హక్ మహ్మద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల దూమారాన్ని రేపుతున్నాయి.

ఈ హత్యలో కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉందని, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్ ఆరోపించగా… సీనియర్ నేత రమేశ్ చెన్నితాల తోసిపుచ్చారు. హత్యా రాజకీయాలు తమ సంస్కృతి కాదని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మిగతా వారి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఇద్దరి హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed