అదరగొట్టిన ఢిల్లీ.. రాజస్థాన్‌కు వరుసగా రెండో ఓటమి

by Dishanational3 |
అదరగొట్టిన ఢిల్లీ.. రాజస్థాన్‌కు వరుసగా రెండో ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ ఆశలను మెరుగుపర్చుకుంది. రాజస్థాన్‌తో కీలక మ్యాచ్‌లో నెగ్గి టాప్-5కి చేరుకుంది. ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 20 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 221/8 స్కోరు చేసింది. జేక్ ఫ్రేజర్(50), అభిషేక్ పొరెల్(65) హాఫ్ సెంచరీలతో రెచ్చిపోగా.. ట్రిస్టన్ స్టబ్స్(41) కూడా మెరవడంతో ఢిల్లీకి భారీ స్కోరు దక్కింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 201/8 స్కోరుకే పరిమితమై వరుసగా రెండో ఓటమిని పొందింది. కెప్టెన్ సంజూ శాంసన్(86) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌‌తో జట్టును పోటీలోకి తీసుకొచ్చినా.. మిగతా బ్యాటర్ల వైఫల్యం జట్టును నష్టం కలిగించింది.

Next Story