శ్రీ వారి హుండీ ఆదాయం ఎంతంటే…

by  |
శ్రీ వారి హుండీ ఆదాయం ఎంతంటే…
X

దిశ వెబ్ డెస్క్: తిరుమల శ్రీ వారి ఆలయానికి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చింది. కరోనా నేపథ్యంలో భక్తులు తగ్గడంతో హుండీ ఆదాయం కూడా తగ్గింది. దీంతో ఓ సమయంలో సిబ్బంది జీతాలు ఇవ్వడానికి కూడా టీటీడీ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అయితే చాలా కాలం తర్వాత శ్రీ వారి ఆలయానికి హుండీ ఆదాయం భారీగా వచ్చింది. ఆదివారం హుండీ ద్వారా శ్రీ వారి ఆలయానికి రూ.1.02 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఆలయ పునరుద్దరణ తర్వాత ఇంత భారీగా ఆదాయం రావడం ఇదే తొలిసారని అన్నారు.



Next Story

Most Viewed