అమ్మవారికి తల సమర్పించబోయిన వ్యక్తి.. ఆలయంలో భక్తులంతా భయంతో..

by karthikeya |
అమ్మవారికి తల సమర్పించబోయిన వ్యక్తి.. ఆలయంలో భక్తులంతా భయంతో..
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఆలయాల్లో బలి ఇవ్వడం మనం చూస్తే ఉంటాం. కొంతమంది నిమ్మకాయలు, కొబ్బరికాయలు కొట్టి సాత్విక బలి సమర్పిస్తుంటారు. ఇంకొంతమంది కోళ్లు, మేకలు, గొర్రెలు.. ఇలా తాంత్రిక బలి సమర్పిస్తుంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి ఏకంగా క్షుద్ర బలి.. అంటే తన తలనే నరికి అమ్మవారికి సమర్పించబోయాడు. ఈ షాకింగ్ ఘటన దసరా నవరాత్రుల సందర్భంగా మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. స్థానిక మా బీజాసన్ ఆలయానికి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు.. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత హఠాత్తుగా తన జేబులో నుంచి రేజర్ బ్లేడ్ తీసి తన మెడ కోసుకుని అమ్మవారికి తన తలను సమర్పించడానికి ప్రయత్నించాడు. దీంతో చుట్టుపక్కల భక్తులంతా భయంతో షాక్ అయిపోయారు. ఇంకొంతమంది వెంటనే అతడిని అడ్డుకున్నారు. అప్పటికే మెడపై లోతుగా కట్ అవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 9 రోజులు ఉపవాసం ఉండి అమ్మవారికి తల సమర్పించాలని నిందితుడు భావించినట్లు చెబుతున్నారు.

Advertisement

Next Story