- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
రాఖీ పండుగకు వెళ్లి వస్తూ.. అనంత లోకాలకు..
దిశ, కామారెడ్డి: రాఖీ పండగ ఉందని ఇంటికి వెళ్లారు. పండగ ముగియగానే తెల్లవారుజామున తిరుగు ప్రయాణమయ్యారు. అంతలోనే మూల మలుపు మృత్యు రూపంలో అతన్ని కబళించింది. బైకు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో భర్త మృతి చెందగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరికొండ మండలం గడ్కోల్ గ్రామానికి చెందిన జానకంపేట చిన్న రాములు(50).. ఆయన భార్య బాలమని కలిసి సొంత గ్రామమైన సిరికొండకు రాఖీ పండగ నిమిత్తం వెళ్లారు.
పండగ అయిపోగానే సోమవారం తెల్లవారుజామున తిరుగుముఖం పట్టారు. బైకుపై ఇద్దరు కామారెడ్డికి వస్తుండగా.. రామారెడ్డి గంగమ్మ వాగు మూల మలుపు వద్ద బైకు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యభర్తలిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఓ ఆటోలో ఇద్దరిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. చిన్న రాములును పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టుగా నిర్దారించారు. తీవ్ర గాయలైన బాలమనికి జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చిన్న రాములు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నా