చిత్తూరులో విషాదం.. విద్యుత్ షాక్‌తో ఇద్దరు జార్ఖండ్ కార్మికులు దుర్మరణం..

by srinivas |
current shock
X

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ టవర్ నిర్మాణ పనుల వద్ద విద్యుత్ షాక్‌కి గురై ఇద్దరు కార్మికులు మృతి చెందారు. చిత్తూరు జిల్లా వరదయ్య పాలెం మండలం రాచర్ల వద్ద నూతనంగా నిర్మిస్తున్న 220కేవీ సబ్ స్టేషన్ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. శుక్రవారం యానాదివెట్టు చెరువుసమీపంలో సబ్ స్టేషన్‌కు చెందిన టవర్ నిర్మాణ పనులు చేస్తుండగా.. టవర్‌కి సమీపంలో వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ లైన్ తగిలింది. ఈ దుర్ఘటనలో జార్ఖండ్‌కు చెందిన గహనమారండీ(32), భువనేశ్వర్ మహటో(37) అనే ఇద్దరు కార్మికులు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న ఎస్ఐ పురుషోత్తం రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Next Story