తెలంగాణ లో పీఏసీ మీటింగ్.. ఎప్పుడంటే ?

by Shyam |
ts-assembly
X

దిశ,తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ పబ్లిక్‌ అక్కౌంట్స్‌ కమిటీ సమావేశం ఈనెల 30న జరుగుతుందని గురువారం అసెంబ్లీ కార్యదర్శి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో జరిగే సమావేశంలో బడ్జెట్‌ కేటాయింపులు, మంజూరు, వ్యయాలు , ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌కు సంంధించి ఆడిట్‌ వివరాలపై సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా సెప్టెంబరు 4న అసెంబ్లీ అష్యూరెన్స్‌ కమిటీ నిర్వహించనున్నారు. ఉదయం 11గంటలకు జరిగే సమావేశంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలుతీరు, పర్యావరణ, ఫారెస్ట్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పంచాయితీరాజ్‌ శాఖకు సంబంధించిన ఇచ్చిన హామీలను కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు.

Advertisement

Next Story