కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

by  |
కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కల్లెర్ మండల కేంద్రంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్రంలో పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారు. లాక్‌డౌన్ సమయంలో రైతులు నష్టపోకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు.

Tags : Minister niranjan reddy, open, Purchase Center, mla bhupal reddy,medak


Next Story

Most Viewed