దొంగతనానికి వెళ్లి… సజీవ దహనం

by  |
దొంగతనానికి వెళ్లి… సజీవ దహనం
X

దిశ, వెబ్‌డెస్క్: మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. కిరాణాషాపులో దొంగతనానికి వెళ్లిన ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. ఈ ఘటన జిల్లాలోని టెక్మాల్ మండలం పాల్వంచలో శనివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామంలోని కిరాణా షాపులో ఓ వ్యక్తి చోరీకి యత్నించాడు. షాపులో చీకటిగా ఉండటంతో వెలుగు కోసం అగ్గిపుల్ల వెలిగించారు. దీంతో అగ్గిపుల్ల నిప్పురవ్వలు పెట్రోల్, శానిటైజర్ బాటిళ్లపై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు దొంగకు అంటుకుని అక్కడికక్కడే సజీవ దహనం అయ్యాడు.


Next Story

Most Viewed