అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి.. చంపేశారా..?

by Sumithra |
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి.. చంపేశారా..?
X

దిశ, కొత్తగూడెం : లక్ష్మిదేవిపల్లి మండలం ఎదురుగడ్డ జామాయిల్ తోటలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు కాతేపెళ్లి సుధాకర్ (55) గా గుర్తించారు. సుధాకర్ ఈ నెల 8న రాత్రి 7.30 గంటల సమయంలో సైకిల్ పై ఇంటి నుండి బయటికి వెళ్లి తిరిగి రాలేదు.

గురువారం ఉదయం ఎదురుగడ్డ గ్రామపంచాయతీ శివారులో గల చిప్పమూతిలింగం కాలనీ వద్ద శవమై పడి ఉన్నాడు. అతని తలపై బలమైన గాయం ఉండడంతో ఎవరో దాడిచేసి చంపి ఉంటారని భావించిన లక్ష్మీదేవిపల్లి పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed