కృష్ణా జిల్లాలో దారుణం.. నిద్రిస్తున్న భార్యను భర్త ఏం చేశాడంటే

by Mahesh |
murder
X

దిశ, వెబ్ డెస్క్ : కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భార్యను అతి దారుణంగా చంపిన ఘటన జిల్లాలోని టేకులపల్లిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. తిరువూరు మండలం టేకులపల్లిలో సత్యానారాయణ రెడ్డి, పద్మావతి దంపతులు నివసిస్తున్నరు. వీరికి ఇద్దరు కుమారులు. అయితే తన భార్యకు తనకు గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. దీంతో గురువారం తన భార్య నిద్రిస్తున్న సమయంలో అదే అదునుగా తీసుకుని భార్యను గొడ్డలితో దారుణంగా నరికాడు. అడ్డువచ్చిన కొడుకుపై కూడా దాడి చేశాడు. ప్రస్తుతం కొడుకు పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story