ఆ కమిటీలు రద్దు చేస్తూ.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

by  |
ఆ కమిటీలు రద్దు చేస్తూ.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నా… ఓ పక్కా దాని నియంత్రణా చర్యలు చేపడుతూనే మరోపక్క అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది ప్రభుత్వం. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ, ఏపీ సీఎం జగన్ అందరినీ ఆకర్షిస్తున్నాడు. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో నీటి వినియోగదారుల సంఘాలు, ప్రాజెక్టు కమిటీలు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ సిఫార్సుల మేరకు ప్రస్తుత కమిటీలను ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కమిటీల స్థానంలో ప్రత్యేక అధికారులను నియమిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా 5766 నీటి వినియోగదారుల సంఘాలు, 49 ప్రాజెక్టు కమిటీలు, 244 నీటి పంపిణీ సంఘాల్లో ప్రత్యేక అధికారుల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీటి వినియోగదారుల సంఘాలకు జలవనరుల శాఖలోని స్థానికంగా ఉండే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను, నీటి పంపిణీ సంఘాలకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం పేర్కొంది. ప్రాజెక్టు కమిటీలకు సూపరిండెంట్ ఇంజనీర్లను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.


Next Story

Most Viewed