సర్కారు వారి పాట నుంచి రెండో సాంగ్ రిలీజ్.. దుమ్మురేపిన సితార..

by Satheesh |   ( Updated:2023-04-01 17:57:02.0  )
సర్కారు వారి పాట నుంచి రెండో సాంగ్ రిలీజ్.. దుమ్మురేపిన సితార..
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ పరుశురాం దర్శకత్వం వహిస్తు్న్నారు. తాజాగా చిత్ర బృందం అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. సర్కారు వారి పాట సినిమా నుండి రెండో సింగిల్‌ను ఇవాళ విడుదల చేసింది. 'పెన్నీ' అనే సాంగ్‌ను రిలీజ్ చేయగా.. అందులో మహేష్ చాలా స్టైలిష్ లుక్‌లో మెరవగా.. గారల పట్టి సితార అదిరిపోయే డ్యాన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంది. తొలిసారిగా తండ్రి‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక ఈ చిత్రం నుండి విడుదలైన మొదటి సింగిల్ 'కళావతి' సాంగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో.. గోపి ఆచంట, నవీన్ ఎర్నేని, రవి శంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


Advertisement

Next Story