Veekshanam :కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో వస్తోన్న చిత్రం.. విడుదల నేపథ్యంలో డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

by Anjali |   ( Updated:2024-10-17 15:04:58.0  )
Veekshanam :కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో వస్తోన్న చిత్రం..  విడుదల నేపథ్యంలో డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
X

దిశ, వెబ్‌డెస్క్: చిన్న సినిమాలుగా తెరకెక్కి పెద్ద విజయం సాధించిన సినిమాలను గత కొద్ది రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. అతి తక్కువ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చినా చిత్రాలు కూడా భారీ వసూళ్లను కొల్లగొడుతున్నాయి. ఉదాహరణకు దసరా, బలగం.. రీసెంట్‌గా తెరకెక్కిన కమిటీ కుర్రాళ్లు ఇలా ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి థియేటర్లలో పెద్ద సినిమాలతో సమానంగా ఆడుతున్నాయి. అయితే ఇదే తరహాలో ఓ సూపర్ హిట్ సినిమా రాబోతుంది. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతోన్న వీక్షణం (Veekshanam) మూవీ అక్టోబరు 18 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. అశోక్ నిర్మాణంలో మనోజ్ పల్లేటి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంలో రామ్ కార్తీక్ (Ram Karthik ) కశ్వి (Kashvi) హీరో, హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన హీరో-హీరోయిన్

ఈ సందర్భంగా హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. దర్శకుడు మనోజ్‌కు ధన్యవాదాలు తెలిపాడు. వీక్షణం కథ చాలా బాగా నచ్చిందని అన్నాడు. మిస్టరీ థ్రిల్లర్ జానర్‌లో వీక్షణం చిత్రం సరికొత్తగా ఉంటుందని వెల్లడించాడు. 18 న ఈ మూవీతో మీ ముందుకొస్తున్నామని.. కాగా అందరూ వీక్షించి సినిమా ఎలా ఉందో చెప్పడంటూ వ్యాఖ్యానించాడు. తర్వాత కథానాయిక కశ్వి మాట్లాడుతూ.. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తుందని, నాకు అయితే వీక్షణం విడుదలవుతుంటే చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని తెలిపింది.

వీక్షణం తప్పకుండా అందరికి నచ్చుతుంది: దర్శకుడు

అలాగే దర్శకుడు మనోజ్ పల్లేటి మాట్లాడారు. ఈ మూవీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానని అన్నారు. మేం ఎంతైనా చెప్తామని, ఎవరి బిడ్డ వారికి ముద్దుగానే ఉంటుందని పేర్కొన్నారు. కాగా థియేటర్లలో మీరు వీక్షణం చూసి ఎలా ఉందో చెబితే మాకు హ్యాపీగా అనిపిస్తుందని దర్శకుడు మనోజ్ పల్లేటి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed