మానవత్వం చాటుకున్న ఎస్సై.. పోలీస్ సేవలకు హ్యాట్సాఫ్

by Javid Pasha |
మానవత్వం చాటుకున్న ఎస్సై.. పోలీస్ సేవలకు హ్యాట్సాఫ్
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని బల్మూర్ మండలానికి చెందిన వ్యక్తికి మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సమయంలో అచ్చంపేట నుండి మా గ్రామానికి వస్తున్న ఓ ప్రయాణికుడు రోడ్డు ప్రమాదంలో గాయాలై పడిపోయిన సంఘటన చూసి వెంటనే బల్మూరు పోలీసులకు మరియు 108 సమాచారం అందించారు. విషయం అందుకున్న ఎస్సై సదాశివం నిమిషాల వ్యవధిలో ప్రమాద స్థలానికి తన సిబ్బందితో చేరుకుని సహాయ చర్యలు ముమ్మరం చేశారు.

పోలీసులకు సెల్యూట్..

ఎస్సై తన మానవ దృక్పథంతో ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తన వాహనంలో ఎక్కించి అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందేలా సహకారం అందించారు. సకాలంలో పోలీసుల స్పందించకపోతే.. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చనిపోయేవాడని, ఎస్సై ప్రమాదంలో ఉన్న వ్యక్తిని తన వాహనంలో ఆసుపత్రిలో చేర్చి ప్రాణాలు కాపాడినందుకు బల్మూర్ పోలీసుల సేవలకు మండల ప్రజలు కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు పోలీసులకు సెల్యూట్ తెలిపారు.

Advertisement

Next Story