తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తే సహించం.. చంద్రబాబుకు నిరంజన్ స్వీట్ వార్నింగ్

by Satheesh |
తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తే సహించం.. చంద్రబాబుకు నిరంజన్ స్వీట్ వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రెండు రాష్ట్రాలు బాగుండాలంటే చంద్రబాబు ఏపీకే పరిమితం కావాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు రెండు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు తెలంగాణాలో రాజకీయాలు మానుకోవాలని సూచించారు. తెలంగాణలో మళ్ళీ టీడీపీని పటిష్టం చేస్తామని చంద్రబాబు అనడం దింపుడుగల్లం ఆశలు మాత్రమే అని గుర్తు చేశారు. గతంలో హైదరాబాద్ అభివృద్ధి అంతా తానే చేశానని అనడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తే సహించేది లేదని వెల్లడించారు. చంద్రబాబు ఇక్కడ రాజకీయాల పేరిట సభలు, సమావేశాలు, సంబురాలు, ర్యాలీలు చేయడం బంద్ పెట్టుకోవాలని సూచించారు.

Advertisement

Next Story