Revanth Reddy: ఆ విషయంలో హైకమాండ్‌దే తుది నిర్ణయం: రేవంత్ రెడ్డి క్లారిటీ

by Satheesh |   ( Updated:2022-07-27 09:20:19.0  )
TPCC Chief Revanth Reddy Slams CM KCR and PM Modi Over Floods assistance
X

దిశ, వెబ్‌డెస్క్: TPCC Chief Revanth Reddy Slams CM KCR and PM Modi Over Floods assistance| తెలంగాణ పట్ల ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీపీపీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. గుజరాత్‌కు వరదలు వస్తే వెంటనే సాయం చేసే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్షత చూపిస్తోందని అన్నారు. తెలంగాణలోని వరద కష్టాలు, నష్టాలపై చర్చించేందుకు అపాయింట్‌మెంట్ కోరినా ప్రధాని మోడీ ఇవ్వలేదని తెలిపారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశం పార్టీలో అంతర్గంగా చర్చిస్తామని అన్నారు. ఆ విషయంలో హైకమాండ్‌దే తుది నిర్ణయమని రేవంత్ స్పష్టం చేశారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో కోమటిరెడ్డి హాట్ టాపిక్‌గా మారారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న ఆయన.. హస్తాన్ని వీడి బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ యధాతథస్థితి కొనసాగించండి : సుప్రీంకోర్టు

Advertisement

Next Story

Most Viewed