టీటీడీ బోర్డు లాగా యాదాద్రి టెంపుల్ బోర్డు : సీఎం రేవంత్ రెడ్డి

by M.Rajitha |
టీటీడీ బోర్డు లాగా యాదాద్రి టెంపుల్ బోర్డు : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ది పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయంలో జరుగుతున్న పనులు, మిగిలిపోయిన పెండింగ్ పనుల వివరాలు వెంటనే తనకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. స్వామివారి ప్రధాన ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు వెంటనే మొదలు పెట్టాలని సూచించారు. టీటీడీ తరహాలో యాదాద్రి టెంపుల్ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే యాదగిరిగుట్టను టూరిస్ట్ ప్రదేశంగా మార్చేందుకు ఇంకా ఏమి చేయవచ్చునో అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు. ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగకుండా ఆలయ పనులు, వివిధ కార్యక్రమాలు జరపాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆలయ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ఇతర ఉన్నతాధికారులతో పాటు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed