యాసంగి సీజన్ పంటకు ఎందుకివ్వరు? రూ 500 బోనస్ ఇవ్వాల్సిందే బీఆర్ఎస్

by Ramesh N |
యాసంగి సీజన్ పంటకు ఎందుకివ్వరు? రూ 500 బోనస్ ఇవ్వాల్సిందే బీఆర్ఎస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే వానాకాలం సీజన్లో పండించే వరికి రాష్ట ప్రభుత్వం క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చెప్పారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ వ్యవసాయ శాఖ మంత్రి పై తీవ్ర విమర్శలు చేసింది. యాసంగి సీజన్ పంటకు ఎందుకివ్వరు అని ప్రశ్నించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా టీఎస్‌డబ్ల్యూఐడీసీ కార్పోరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

‘యాసంగి సీజన్ పంటకు ఎందుకు ఇవ్వరు తుమ్మల? మీ వంద రోజుల సమయం లెక్కన కూడా యాసంగి పంట వేసిన రైతులు కూడా బోనస్ కు అర్హులే.. స్వయానా రైతు అయిన మీరు కూడా ఇలా వాయిదాలు వేయడం సరి కాదు. దయచేసి మీ నిర్ణయం మార్చి యాసంగి పంటకు కూడా బోనస్ ఇవ్వండి’ అని పేర్కొన్నారు.

Next Story

Most Viewed