తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం: MP డీకే అరుణ

by Satheesh |
తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం: MP డీకే అరుణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి భయంతో బీజేపీ గెలుపును అడ్డుకోవాలని అనేక కుట్రలు చేసిందని, సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని అనేక రకాలుగా దూషించారని, అయినా ప్రజలు వారిని నమ్మలేదని, బీజేపీని 8 స్థానాల్లో గెలిపించారని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. బీజేపీ రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని దుష్ప్రచారం చేసిందని, ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తించి బీజేపీ గెలుపును ఆపాలని చూశారని ఆమె విమర్శలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నాయకులను గెలిపించుకునేలా కార్యకర్తలు కృషిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని మరింత బలోపేతం చేయాలని డీకే అరుణ కోరారు. భవిష్యత్‌లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు.

Advertisement

Next Story

Most Viewed