CM Revanth Reddy : చైనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణను అభివృద్ధి చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి

by Rajesh |
CM Revanth Reddy : చైనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణను అభివృద్ధి చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఎన్ఆర్ఐలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే వారికి పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. అభివృద్ధిలో అమెరికాతో పోటీ పడదామని తెలిపారు. చైనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణను అభివృద్ధి చేస్తామన్నారు. పెట్టుబడులు పెట్టాలని ఎన్ఆర్ఐలను ఆహ్వానిస్తున్నా అని.. మన రాష్ట్రాన్ని మనం తీర్చిదిద్దుకుందామన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామన్నారు. కాగా, 11 రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలోని పలు నగరాలతో పాటు దక్షిణ కొరియాలోని సియోల్‌లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించనుంది.

Advertisement

Next Story

Most Viewed