సొంత ఖర్చులతో 115 స్టూడెంట్స్‌కు ఉచిత బస్‌పాస్‌లు.. అందజేసిన జెడ్పీ చైర్ పర్సన్

by Vinod kumar |   ( Updated:2023-08-10 12:47:12.0  )
సొంత ఖర్చులతో 115 స్టూడెంట్స్‌కు ఉచిత బస్‌పాస్‌లు.. అందజేసిన జెడ్పీ చైర్ పర్సన్
X

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు మండలంలోని మోడల్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థినులైన 115 మందికి జెడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి సొంత ఖర్చలతో ఉచిత బస్‌పాస్‌లు అందజేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే కార్పోరేట్‌కు దీటుగా విద్యార్థులకు విద్యా భోధన జరుగుతుందని, విద్యార్థులు ప్రభుత్వం అందజేసే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆమె అనుసూచించారు. ఈ కార్యక్రమంలో జకారమ్ సర్పంచ్ రమేష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమేష్, కో ఆప్షన్ సభ్యుడు రియాజ్, ఇంచర్ల పీఎసీఎస్ ఛైర్మెన్ రాములు, రమేష్ రెడ్డి, బిక్ష పతి, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed