మహిళా పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

by Aamani |   ( Updated:2024-10-05 12:32:34.0  )
మహిళా పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం
X

దిశ,డోర్నకల్(కురవి) : ఓ వ్యక్తి మానసికంగా వేధిస్తున్నాడని మహిళ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తట్టుపల్లి గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా నాగలక్ష్మి విధులు నిర్వర్తిస్తున్నారు.ఇటీవల డీపీఓ ఆఫీస్ లో అందజేయాల్సిన ఓటర్ లిస్ట్ ఆలస్యం కావడంతో అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు.ఇదే విషయం విలేజ్ గ్రూప్ లో పోస్ట్ చేసినట్లు తెలిపారు. గ్రామంలో ఓ వ్యక్తి ఇబ్బందులకు గురి చేసినట్లు ఆరోపించారు.గ్రామ పంచాయతీలో చేస్తున్న ప్రతి పనిలో కలుగజేసుకుంటూ, ఏడాదిగా తనను మానసికంగా వేధిస్తున్నాడని ఆమె ఆరోపించారు.ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed