- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
బడికి రారు భత్యాలు మాత్రం అకౌంట్లోకి.. సంతకం ఉంటే చాలు మనిషి లేకపోయినా పర్లేదు..
![బడికి రారు భత్యాలు మాత్రం అకౌంట్లోకి.. సంతకం ఉంటే చాలు మనిషి లేకపోయినా పర్లేదు.. బడికి రారు భత్యాలు మాత్రం అకౌంట్లోకి.. సంతకం ఉంటే చాలు మనిషి లేకపోయినా పర్లేదు..](https://www.dishadaily.com/h-upload/2024/06/29/347386-20.webp)
దిశ,గూడూరు : బడికి రారు భత్యాలు మాత్రం నెలకు తప్పకుండా వస్తాయి.సంతకం ఉంటే చాలు పై అధికారులు జీతాల బిల్లులు పాస్ చేస్తారు. గూడూరు మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇదే తంతు సాగుతుంది.. వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని వెంగంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని బోడ చక్రూ తండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ఒకే ఉపాధ్యాయురాలతో నడుస్తుంది.కాగా ఆమె కూడా శుక్రవారం పాఠశాలకు గైర్హాజారవడంతో పాఠశాల తాళం తీసి విద్యార్థులు తరగతి గదులకు వెళ్ళారు. పాఠశాలకు వెళ్లి చూడగా సదరు ఉపాధ్యాయురాలు లేకపోవడంతో సంబంధిత ఎంఈఓ శ్రీదేవిని వివరణ కోరగా తనకు రెండు మండలాల ఇన్చార్జిగా ఇవ్వడం జరిగిందని అందువల్ల అన్ని పాఠశాల లు తిరగడం వీలు కాలేదని అన్నారు.
ఇన్చార్జి స్థానిక జడ్పీహెచ్ఎస్ గూడూరు పాఠశాల హెడ్ మాస్టర్ సదాశివ కు అప్పగించామని తెలిపారు. గూడూరు మండలం లో పాఠశాల లపై పర్యవేక్షణ కరువైందని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. అయితే ఉపాధ్యాయులు పాఠశాలకు రాని రోజు సంతకాలను మరుసటి రోజు వచ్చి పెడుతున్నారని ఇది కేవలం గూడూరు మండలానికి చెందిన ఉపాధ్యాయులకు సాధ్యపడుతుందని పలువురు చర్చించుకుంటున్నారు .ఇప్పటికైనా సీఆర్టీలు మండల వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని లేకపోతే ప్రభుత్వ పాఠశాలలో లక్షల జీతాలు ఎత్తుకునే టీచర్లు కనీసం పాఠశాలకు రాకుండా సంతకాలు పెట్టుకుంటున్నారని ఇలా చేస్తే ప్రజాధనం వృధాగా పోతుందని దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గూడూరు మండల ప్రజలు కోరుతున్నారు.