ఇంట్లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్..

by Disha Web Desk 23 |
ఇంట్లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్..
X

దిశ,చెన్నారావుపేట: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు నెక్కొండ సీఐ చంద్రమోహన్ తెలిపారు. శుక్రవారం చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. చెన్నారావుపేట మండల కేంద్రానికి చెందిన మండల మల్లికాంబ భర్త మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆమె నివాసముంటున్న ఇంటిని వదిలి అదే కాలనిలో వేరే ఇంట్లో అద్దెకు ఉంటుంది. వదిలి పెట్టిన ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దుగ్గొండి మండలం చలపర్తి గ్రామానికి చెందిన కోలా నరసయ్య ఆదివారం అర్ధరాత్రి తాళం వేసిన ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో చొరబడి బీరువా సైతం పగలగొట్టి అందులో ఉన్న తులం బంగారం, 30 తులాల వెండి, 50 కిలోల బియ్యంను దొంగిలించుకు పోయినట్లు తెలిపారు.

దీంతో బాధితురాలు మండల మల్లికాంబ సోమవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ గూడ అరుణ్ ఆధ్వర్యంలో కోనాపురం గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా నర్సయ్య కనిపించగా అతన్ని పూర్తిస్థాయిలో విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. దొంగిలించిన తులం బంగారం, 30 తులాల వెండి, 50 కిలోల బియ్యంను చెన్నారావుపేట గ్రామానికి చెందిన తన చెల్లె మాచర్ల జమున ఇంట్లో దాచి పెట్టినట్లు తెలిపాడు. వెంటనే ఇంట్లో దాచిపెట్టిన బంగారం, వెండి, బియ్యాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడు నరసయ్య పై కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు.ఈ కేసును త్వరగా ఛేదించిన ఎస్సై గూడ అరుణ్ పోలీస్ సిబ్బందిని సీఐ చంద్రమోహన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వీరన్న, కానిస్టేబుళ్లు సురేష్, సల్మాన్ పాషా, నరేష్, యాకయ్య, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed