బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన భూత్పూర్ ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి

by Disha Web Desk 23 |
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన భూత్పూర్ ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి
X

దిశ,దేవరకద్ర/భూత్పూర్: దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. భూత్పూర్ మండల ఎంపీపీ కదిరి శేఖర్ రెడ్డి తో పాటు పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఏఐసీసీ కార్యదర్శి ఎస్ ఏ సంపత్ కుమార్ ,దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో కర్వేన మాజీ సర్పంచ్ జహంగీర్ బి బలే మియా ,మద్దిగట్ల సర్పంచ్ కదిరే ప్రియాంక ఓంకార్ రెడ్డి ,సింగల్ విండో డైరెక్టర్ రామ్ రెడ్డి , కర్వేనా ఎంపిటిసి నిర్మల మాధవరెడ్డి ,మద్దిగట్ల డిప్యూటీ సర్పంచ్ పిట్టల శేఖర్, కొత్త మొల్గర మహేష్, పలువురు వార్డు మెంబర్స్ మాజీ వార్డ్ మెంబర్స్ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ,వివిధ కుల సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అన్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చని బీజేపీ పార్టీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు పార్లమెంట్ ఎన్నికల్లో రెండు లక్షల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భూత్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కేశిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి భూత్పూర్ మున్సిపాలిటీ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వెంకట నరసింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed