నాంపల్లి రైల్వే స్టేషన్ లో పట్టుబడ్డ 9 లక్షల నగదు

by Disha Web Desk 11 |
నాంపల్లి రైల్వే స్టేషన్ లో పట్టుబడ్డ 9 లక్షల నగదు
X

దిశ,కార్వాన్: నాంపల్లి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో 9 లక్షలు పట్టు బడిన సంఘటన వెలుగు చూసింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నాంపల్లి రైల్వేస్టేషన్ లో ఆర్పీఎఫ్ పోలీసులు ప్రయాణికుల బ్యాగులను తనిఖీలు చేపట్టగా ఫ్లాట్ ఫార్మ్ నెంబర్ 4లో బాపట్ల జిల్లా , చీరాలకు చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతని బ్యాగ్ ను తనిఖీ చేశారు. కాగా అందులో 9 లక్షల నగదు లభ్యం అయింది. నగదుకు సంబంధించిన డాక్యుమెంట్స్ పై ఆరా తీయగా సరైన పత్రాలు లేకపోవడంతో ఆర్పీఎఫ్ పోలీసులు నగదును సీజ్ చేశారు. వ్యాపార లావాదేవీల నిమిత్తం నగదును చెన్నై ఏక్స్ ప్రెస్ లో బాపట్ల కు తీసుకెళ్తున్నట్లు బాలకృష్ణ తెలిపారు. సీజ్ చేసిన నగదును సికింద్రాబాద్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారికి నాంపల్లి ఆర్పీఎఫ్ పోలీసులు అందజేశారు.

Next Story

Most Viewed