మంగపేటలో దొంగనోట్ల కలకలం

by Disha Web Desk 23 |
మంగపేటలో దొంగనోట్ల కలకలం
X

దిశ, మంగపేట : మండల కేంద్రంలో దొంగ నోట్ల చలామణి వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. మండల కేంద్రానికి చెందిన ఓ ఎలక్ట్రానిక్స్ వ్యాపారి తన వద్ద వస్తువులు కొన్న వారు ఇచ్చిన డబ్బుల్లో దొంగ నోటు వచ్చినట్లు తెలిపి మండల ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో దొంగ నోటును వైరల్ చేశాడు. తన వ్యాపారంలో వచ్చిన డబ్బులను గురువారం బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్లగా బ్యాంకు అధికారులు దొంగ 2 వందల నోటును గుర్తించినట్లు తెలిపాడు. దొంగ నోట్లు మండలంలో చలామణి చేస్తున్నారనే వ్యవహారం మండలంలో కలకలం సృష్టించింది.

Next Story

Most Viewed