Police Encounter: ములుగు జిల్లాలో పోలీసుల ఎన్‌కౌంటర్.. ఓ మావోయిస్టు మృతి

by Shiva |
Police Encounter: ములుగు జిల్లాలో పోలీసుల ఎన్‌కౌంటర్.. ఓ మావోయిస్టు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ములుగు, ఖమ్మం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో బల్లేపల్లి వద్ద మావోయిస్టు అగ్ర నేతలు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో అడవిలో కూంబింగ్ నిర్వహిస్తుండగా.. పోలీసులకు నర్సంపేట డివిజన్ కార్యదర్శి బద్రు దళం ఎదురుపడింది. దీంతో ఇరు పక్షాల వారు ఫైర్ ఓపెన్ చేయగా.. పోలీసు కాల్పుల్లో ఓ మావోయిస్టు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దళ సభ్యుల్లో మరికొందరికి గాయాలయ్యాయి. అయితే, మృతుడు భూపాలపల్లి జిల్లా గొల్ల బుద్ధారం గ్రామానికి చెందిన అశోక్‌గా పోలీసులు గుర్తించారు.



Next Story