పార్టీలు ముఖ్యం కాదు ప్రజలే ముఖ్యం.. : రేవూరి ప్రకాష్ రెడ్డి

by Aamani |
పార్టీలు ముఖ్యం కాదు ప్రజలే ముఖ్యం.. : రేవూరి ప్రకాష్ రెడ్డి
X

దిశ,హనుమకొండ టౌన్ : ప్రజా ప్రతినిధులు ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు మరిన్ని సేవలందించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకు పార్టీలు ముఖ్యం కాదు ప్రజలే ముఖ్యం అని అదే సిద్ధాంతం మీద ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మరీనా ప్రజా ప్రతినిధులు మాత్రం ప్రజల వైపే ఉండాలని అధికారులతో కలిసిమెలసి గ్రామాలను అభివృద్ధి చేయాలని తెలిపారు. అధికారంలో ఉన్న లేకున్నా జడ్పీటీపీసీ, ఎంపీటీసీలుగా గెలిపించిన ప్రజలను కార్యకర్తలకు మరవొద్దని ఎంపీటీసీలకు, జడ్పీటీసీకి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సూచించారు. అనంతరం ఆత్మకూర్ మండల కేంద్రంలో ఉన్న ఎంపీటీసీలను శాలువాలతో సన్మానించి దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నిర్వహించారు.

ఏ స్థాయిలో ఉన్న తల్లిదండ్రులను మరవవద్దు..మాజీ ఎంపీటీసీ వరుణ్ గాంధీ..

ప్రజాప్రతినిధులుగా ఏ స్థాయిలో ఉన్న కన్నా తల్లితండ్రులను మరవకూడదని మాజీ ఎంపీటీసీ ఆర్షం వరుణ్ గాంధీ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో నీరుకుళ్ల మాజీ ఎంపీటీసీ వరుణ్ గాంధీ మాట్లాడుతు ప్రజా ప్రతినిధిగా ఎదగడానికి తన తల్లి పాత్ర ఎంతగానో ఉందని తన తల్లివల్లే ఇవ్వాళ ఈ స్థాయిలో ఉన్ననని వరుణ్ గాంధీ కొనియాడారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో తన తల్లిని సన్మానించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఆత్మకూరు మాజీ సర్పంచ్ పర్వతగిరి రాజు, మాజీ ఎంపీపీ మార్క సుమలత, మాజీ జడ్పీటీసీ కక్కెర్ల రాధిక, మాజీ వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్ రెడ్డి, మాజీ కో ఆప్షన్ మెంబర్ అంకూస్, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పరికరాల వాసు, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు రేవూరి జైపాల్ రెడ్డి, ఆత్మకూరు పీఏసీఎస్ చైర్మన్ ఎరుకొండ రవీందర్ గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తనుగుల సందీప్,జిల్లా కాంగ్రెస్ నాయకులు కక్కెర్ల రాజు గౌడ్, మార్క రజిని కర్ గౌడ్, కటాక్షపూర్ మాజీ సర్పంచ్ యాదగిరి గౌడ్, మండల మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed