పార్ట్ టైం సిబ్బంది వేతనాలు చెల్లించాలంటూ నిరసన..

by Sumithra |
పార్ట్ టైం సిబ్బంది వేతనాలు చెల్లించాలంటూ నిరసన..
X

దిశ, శాయంపేట : మండల కేంద్రంలో ఉన్న భూపాలపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో పనిచేస్తున్న పార్ట్ టైం సిబ్బంది వేతనాలు చెల్లించకపోవడంతో సోమవారం పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా చెల్లించక పోవడంతో పాఠశాలలో పనిచేసే పార్ట్ టైం టీచర్లు, లెక్చరర్లు కళాశాలలో పనిచేస్తే సబ్జెక్టు అసోసియేట్స్ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ సంక్షేమ పాఠశాలలో ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధానోపాధ్యాయులకు వినతి పత్రాలు అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed