వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ఏకైక సీఎం కేసీఆర్ : మంత్రి సత్యవతి రాథోడ్

by Vinod kumar |
వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ఏకైక సీఎం కేసీఆర్ : మంత్రి సత్యవతి రాథోడ్
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి: గ్రామ స్థాయిలో సేవలు చేస్తున్న విఆర్ ఏ లను గుర్తించి, వారిని ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తింపు ఇచ్చిన దేశంలో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రం లో బాలాజీ గార్డన్ లో నిర్వహించిన విఆర్ ఏ లకు ఆర్డర్ కాపీ ల అందజేత కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ.. జిల్లా లో సుమారు 600 మంది కుటుంబాలు సంతోషం లో ఉన్నాయని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆనందం లో ఉన్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికులు, విఆర్ ఏ లను ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తించడం సహాసోపేత మైన నిర్ణయమన్నారు.12 కోట్లతో త్వరలో గిరిజన బాలికల గురుకుల పాఠశాల భవనం నిర్మించనున్నట్లు తెలిపారు. తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు, కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ డేవిడ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed