Minister Ponguleti : వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది

by Aamani |
Minister Ponguleti : వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది
X

దిశ,డోర్నకల్ : ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలకు ఆకేరు వరద బీభత్సానికి ములకలపల్లి గ్రామం కకావికలమైన విషయం పాఠకులకు విధితమే.శనివారం రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ ప్రాంతాన్ని పర్యటించారు.వరదలతో దెబ్బతిన్న పంటలు,నివాసాలు,ఆస్తి నష్టాన్ని అధికారులు,కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల శ్రీనివాస్ యాదవ్ మంత్రికి వివరించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అన్నదాతలు అధైర్య పడుద్దన్నారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు. ధ్వంసమైన వంతెనలు,రహదారుల పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు.ఆయన వెంట అధికారులు,మండల అధ్యక్షుడు జగదీష్ నాయక్, రావుల రామకృష్ణ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed