అగ్నిప్రమాదంలో మొక్కజొన్న పంట దగ్ధం

by Disha Web Desk 23 |
అగ్నిప్రమాదంలో మొక్కజొన్న పంట దగ్ధం
X

దిశ,బయ్యారం మహబూబాబాద్ : జిల్లా బయ్యారం మండలం లో సాంబా తండాలో గురువారం అగ్ని ప్రమాదంలో చేతి కాడికి వచ్చిన రైతుల మొక్కజొన్న పంట కాలి బూడిద అయినట్లు రైతులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం భూక్య శ్రీ రాములు 2 ఎకరాలు బోడ లస్కర్ 1ఎకరం, బోడమంగి లాల్ 2ఎకరాలు తమ పండించిన మొక్క జొన్న పంట కూలీలతో కంకులు ఇంటి పొలంలో కుప్పలు పోసి ఇంటికి వెళ్ళి తిరిగి సాయంత్రం సమయంలో వారి పంట పొలం వద్దకు రాగా మొక్క జొన్న పంట కళ్ల ముందే కాలి బూడిద కావడంతో ఆ రైతులు తీవ్రంగా నష్ట పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎవరో నర్సాపురం అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు తునికాకు ప్రూనింగ్ కాంట్రాక్టర్ కూలీలు అటవి ప్రాంతంలో నిప్పు పెట్టడంతో గాలి వాటానికి తమ మొక్క జొన్న పంటకు నిప్పంటించుకుని పంట కాలి బూడిద అయినట్లు ఆరోపించారు.ఈ సంఘటనతో రైతులు తీవ్రంగా నష్ణ పోయినట్లు పేర్కొన్నారు.


Next Story