- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అగ్నిప్రమాదంలో మొక్కజొన్న పంట దగ్ధం
దిశ,బయ్యారం మహబూబాబాద్ : జిల్లా బయ్యారం మండలం లో సాంబా తండాలో గురువారం అగ్ని ప్రమాదంలో చేతి కాడికి వచ్చిన రైతుల మొక్కజొన్న పంట కాలి బూడిద అయినట్లు రైతులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం భూక్య శ్రీ రాములు 2 ఎకరాలు బోడ లస్కర్ 1ఎకరం, బోడమంగి లాల్ 2ఎకరాలు తమ పండించిన మొక్క జొన్న పంట కూలీలతో కంకులు ఇంటి పొలంలో కుప్పలు పోసి ఇంటికి వెళ్ళి తిరిగి సాయంత్రం సమయంలో వారి పంట పొలం వద్దకు రాగా మొక్క జొన్న పంట కళ్ల ముందే కాలి బూడిద కావడంతో ఆ రైతులు తీవ్రంగా నష్ట పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎవరో నర్సాపురం అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు తునికాకు ప్రూనింగ్ కాంట్రాక్టర్ కూలీలు అటవి ప్రాంతంలో నిప్పు పెట్టడంతో గాలి వాటానికి తమ మొక్క జొన్న పంటకు నిప్పంటించుకుని పంట కాలి బూడిద అయినట్లు ఆరోపించారు.ఈ సంఘటనతో రైతులు తీవ్రంగా నష్ణ పోయినట్లు పేర్కొన్నారు.