బీజేపీ అభ్య‌ర్థి కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి గెలుపు ఖాయం

by Disha Web Desk 11 |
బీజేపీ అభ్య‌ర్థి కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి గెలుపు ఖాయం
X

దిశ‌, గండిపేట్ : భారతీయ జనతా పార్టీ చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ప్రజల నుంచి విశేష స్పంద‌న వ‌స్తుంద‌ని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి స‌తీమ‌ణి సంగీతారెడ్డి అన్నారు. శ‌నివారం రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని మణికొండ ల్యాంకో హిల్స్ లో ఆమె శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా సంగీతారెడ్డి మాట్లాడుతూ.. మే 13 న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు ప్రజలు మరోసారి నరేంద్ర మోడీ పాలనను కోరుకుంటున్నారని ఆమె చెప్పారు. తమ భవిష్యత్తు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని కావాలని వారు భావిస్తున్నారని కొండా సంగీతా రెడ్డి తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed