ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కారించాలి : అశ్విని తానాజీ వాకడే

by Aamani |
ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కారించాలి  : అశ్విని తానాజీ వాకడే
X

దిశ, వరంగల్ టౌన్ : ప్రజావాణి ఫిర్యాదులను వెను వెంటనే పరిష్కరించాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పురస్కరించుకుని బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుంచి 72 వినతులు స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు. ఫిర్యాదుల వివరాలు ..ఇంజనీరింగ్ విభాగానికి 23, హెల్త్ అండ్ శానిటేషన్ కు 06, ప్రాపర్టీ టాక్స్(రెవెన్యూ)కు 05, టౌన్ ప్లానింగ్ విభాగానికి 43, ఎలక్ట్రికల్ విభాగానికి 02 అందజేశారు.కార్యక్రమంలో ఎస్ఈలు ప్రవీణ్ చంద్ర,రాజయ్య, సీఎం హెచ్ఓ రాజేశ్, బయాలజిస్ట్ మాధవరెడ్డి, హెచ్ ఓ రమేష్, డిఎఫ్ఓ శంకర్ లింగం, టీపీఆర్ ఓ కోలా రాజేష్ కుమార్ గౌడ్, డీసీపీ రవీందర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, టిఓ బిర్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed