గీసుగొండ ప్రజలది విడదీయలేని బంధం : కొండా సురేఖ

by Aamani |
గీసుగొండ ప్రజలది విడదీయలేని బంధం : కొండా సురేఖ
X

దిశ,గీసుగొండ: తమను ఎంపీపీ స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు ఎదిగేలా చేసిన గీసుకొండ ప్రజలకు అండగా ఉంటామని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు. మండలంలోని కొమ్మాల గ్రామంలో రడం భరత్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండా మురళి జన్మదిన వేడుకల్లో మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమను ఎంపీపీ స్థాయి నుండి రాష్ట్ర మంత్రి వరకు ఎదిగేందుకు కష్టపడ్డ కార్యకర్తలు, నాయకులు ఉన్నారని, వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని అన్నారు. అందుకే గీసుకొండ మండలం అంటే ప్రత్యేక అభిమానం ఉంటుందని ఆమె అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని కొండా సురేఖ ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed