జనగామలో ఇద్దరు బాలికలపై గ్యాంగ్ రేప్

by M.Rajitha |
జనగామలో ఇద్దరు బాలికలపై గ్యాంగ్ రేప్
X

దిశ, జనగామ : జనగామ జిల్లా వరుస లైంగికదాడుల సంఘటనలతో ఉలిక్కి పడుతోంది. నిన్న మొన్న కొమురవెల్లి పరిధిలోనీ గురువాన్నపేట సంఘటనా మరవకముందే లో ఐదుగురు యువకుల అరెస్టుతో ఒక్కసారి అలజడి మొదలైంది. వివరాలు పరిశీలిస్తే ఐఎస్ సదన్లోని పునరావాస కేంద్రం నుండి గత నెల 24 తేదిన ఇద్దరు బాలికలు పారిపోయి జనగామకు చేరుకున్నారు. ఆ ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకులు అత్యాచారం చేశారని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనగామకు, మల్కాజిగిరికి చెందిన 14, 15 ఏళ్ల బాలికలు అదే రోజు జనగామ బస్టాండ్ చేరుకున్నారు. వారు తీరును చూసి ఆశ్రయం కల్పిస్తామని నాగరాజు, సాయి, రాజు, అఖిల్, రోహిత్ నమ్మించి వారిపై అత్యాచారం చేసి తిరిగి వదిలేశారు. పోలీసులు అమ్మాయిలను గుర్తించి ఆరాతీయగా వారు విషయం మొత్తం పోలీసులకు తెలియజేశారు. దీంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story

Most Viewed