రావుల శ్రీధర్ రెడ్డి ఇంట్లో తేనేటి విందును స్వీకరించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు..

by Sumithra |
రావుల శ్రీధర్ రెడ్డి ఇంట్లో తేనేటి విందును స్వీకరించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు..
X

దిశ, రాయపర్తి : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి దయాకర్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటుచేసిన రైతుల ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ధర్నా అనంతరం రాయపర్తి మండలం ఊకల్లు గ్రామంలోని మాజీ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి నివాసానికి మాజీ మంత్రి, ప్రస్థుత ఎమ్మెల్యే హరిష్ రావు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ , జనగాం ఎమ్మేల్యే పల్లా. రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదన్ ఛారి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎనుగుల రాకేష్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటికి వచ్చారు. బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన తేనేటి విందును మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు స్వీకరించారు.

Advertisement

Next Story

Most Viewed