ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు : అశ్విని తానాజీ వాకడే

by Aamani |
ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు : అశ్విని తానాజీ వాకడే
X

దిశ, వరంగల్ టౌన్ : ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించడంలో జాప్యం చేయొద్దని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని బల్డియా ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా స్వీకరించిన ఫిర్యాదుల వివరాలు.. ఇంజనీరింగ్ విభాగం నుంచి 20, హెల్త్ అండ్ సానిటేషన్ నుంచి 04,ప్రాపర్టీ టాక్స్ (రెవెన్యూ) నుంచి 10, టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి 38, మొత్తం 72 వినతులు అందజేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కమిషనర్ కృష్ణారెడ్డి, ఎస్ఈలు కృష్ణారావు, ప్రవీణ్ చంద్ర, సిఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, బయాలజిస్ట్ మాధవ రెడ్డి, డిఎఫ్ఓ శంకర్ లింగం, హెచ్ఓ రమేష్, టీపీఆర్ఓ కోలా రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed