సమయానికి రాని బస్సులు.. ప్రయాణికుల అవస్థలు

by Aamani |
సమయానికి రాని బస్సులు..  ప్రయాణికుల అవస్థలు
X

దిశ,కేసముద్రం: రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఆదరణతో ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన బస్ స్టేషన్ నామ మాత్రంగా తయారైంది. కేసముద్రం నుంచి వరంగల్ కు హైదరాబాద్ కు భద్రాచలానికి, వేములవాడకు వివిధ రూట్ లలో ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయగా, వాటి రాకపోకల సమయాల బోర్డు ఏర్పాటు చేయకపోవడం తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఎవరిని అడగాలో కూడా అర్థం కాని స్థితిలో ప్రజలు ఉన్నారు. ఇంకా కేసముద్రం నుండి గూడూరు, నర్సంపేట కి బస్ సర్వీసులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. తొర్రూర్ బస్ లు అయితే బస్ స్టేషన్ కు వచ్చిన దాఖలాలు లేవు. గూడూరు రూట్ లో బస్సులు లేకపోవడం, ఉన్న బస్సు లకు సమయపాలన లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అన్ని రూట్ లలో సమయపాలన బోర్డును టీజీ ఆర్టీసీ వారు ఏర్పాటు చేయాలని, బోర్డ్ పైన ఎంక్వయిరీ ఫోన్ నెంబర్ కూడా ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story