- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
డిల్లీలో ‘తిరంగా బైక్ ర్యాలీ’.. పంద్రాగస్టున ప్రతి ఇంటిపై జెండా ఎగురాలి
దిశ, తెలంగాణ బ్యూరో: పంద్రాగస్టు సందర్భంగా ప్రతి ఇంటిపై, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ఇలా ప్రతిచోటా జాతీయ జెండా ఎగురవేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి దేశ ప్రజలను కోరారు. దేశరాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం తిరంగా ర్యాలీని నిర్వహించారు. ప్రగతి మైదాన్ వద్ద కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో కేంద్రమంత్రులు, ఎంపీలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు కూడా తమ తమ ప్రాంతాల్లో తిరంగా ర్యాలీలు చేపట్టాలని, స్వచ్ఛందంగా భాగస్వామ్యులై జాతీయ భావనను ప్రదర్శించాలని కోరారు. అంతకుముందు భారత ఉపరాష్ట్రతి జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ.. వ్యక్తిగత అభిప్రాయాలు, కుల, మత, ప్రాంత అభిప్రాయ భేదాలకన్నా.. జాతీయ భావనే అత్యుత్తమమని స్పష్టంచేశారు.
ప్రతి ఒక్కరూ నా దేశం అని భావించినపుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అందరూ బాధ్యతాయుతంగా నడుచుకున్నప్పుడే.. స్వాతంత్ర్య సమరయోధుల ఆకాంక్షలను చేరుకోగలమన్నారు. అనంతరం ఉపరాష్ట్రపతి జెండా ఊపి.. తిరంగా ర్యాలీని ప్రారంభించారు. ప్రగతి మైదాన్ లో ప్రారంభమైన ఈ ‘తిరంగా బైక్ ర్యాలీ’ ప్రగతి మైదాన్ టన్నెల్, ఇండియా గేట్ సర్కిల్ గుండా కొనసాగి.. మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం గేట్ నెంబర్ 1 వద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్, గజేంద్రసింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్, మీనాక్షి లేఖి, పలువురు ఎంపీలు, బీజేవైఎం కార్యకర్తలు, ఢిల్లీలోని వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.