పోలీసుల వైఫల్యంతోనే దాడులు జరుగుతున్నాయి: నంబూరు శంకరరావు

by Mahesh |
పోలీసుల వైఫల్యంతోనే దాడులు జరుగుతున్నాయి: నంబూరు శంకరరావు
X

దిశ, వెబ్‌డెస్క్: తాను రైతలును పరామర్శించేందుకు వెళ్తే దాడి చేస్తారా.. అంటూ నంబూరు శంకరరావు ప్రశ్నించారు. అలాగే రైతులకు పరిహారం ఇవ్వాలని అడగడం తప్పా అని మండిపడ్డారు. అలాగే పోలీసుల వైఫల్యంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని, వైసీపీ నాయకుడు వాసు కారు ధ్వంసం చేశారని, మాజీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గానికి రాకూడదా.. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మీడియా వేదికగా ప్రశ్నించారు. కాగా మంగళవారం ఉదయం వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వరద ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో దుండగులు ఆయనపై కర్రలతో దాడి చేశారు. ఈ సంఘటన పల్నాడు పరిధిలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed