Theft : 48 గంటల్లో 10 గంటలు మాయం.. షాక్‌లో ఆ గ్రామ ప్రజలు

by Rajesh |
Theft : 48 గంటల్లో 10 గంటలు మాయం.. షాక్‌లో ఆ గ్రామ ప్రజలు
X

దిశ, యాచారం : దేవుని గుడి గంటలను దొంగలు వదలడం లేదు. నిత్యం భక్తుల చేత పూజలు అందుకుంటున్న దేవాలయాలలో గుడిగంటలు మాయం కావడం చర్చంచనీయంగా మారింది. మండల కేంద్రంలోని ముత్యాలమ్మ గుడిలో ఇత్తడితో చేసిన 20 వేలు విలువ చేసే 7, గంటలను దొంగలు ఎత్తుకు పోయారు. శుక్రవారం ఉదయం ఆలయ కమిటీ సభ్యులు గుర్తించారు. అలాగే ఈదమ్మ గుడి వద్ద 2 గంటలు తిరుమలేశుని గుట్ట ఆలయంలో 1 గంటను దొంగలు దొంగలించారు. వీటి విలువ 10వేల వరకు ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. రెండు రోజుల వ్యవధిలో 30 వేల విలువ చేసే 10, గంటలకు దొంగలు మాయం చేశారని. గతంలో ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉన్న హుండీలలో డబ్బులను దొంగలు ఎత్తుకుపోయారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు నిఘాను ప్రతిష్టం చేయాలని దొంగలను పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.



Next Story