కూలీల ఆటో బోల్తా.. నలుగురి పరిస్థితి విషమం

by Rajesh |
కూలీల ఆటో బోల్తా.. నలుగురి పరిస్థితి విషమం
X

దిశ, ములుగు ప్రతినిధి: కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తాపడడంతో అందులో ప్రయాణిస్తున్న కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపి వివరాల ప్రకారం.. మిర్చి పంట ఏరడానికి దొడ్ల కొత్తూరు నుండి వాజేడు గ్రామానికి ఆటోలో వెళ్తుండగా జగన్నాధపురం వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలకు తీవ్ర గాయాలవగా అటుగా వెళుతున్న స్థానికులు గమనించి 108 కి సమాచారం అందించారు. క్షతగాత్రులను వాజేడు ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించడం జరిగింది.ఈ ప్రమాదంలో గాయపడ్డ నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Next Story