మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో కుటుంబంపై దాడి

by Gantepaka Srikanth |
మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో కుటుంబంపై దాడి
X

దిశ, తూప్రాన్: కుటుంబ పెద్ద చనిపోవడంతో భార్య, బిడ్డ, అల్లుడితో కలిసి పెద్దలకు శనివారం రాత్రి పూజ నిర్వహించారు. దీంతో మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో తోటి కుటుంబీకులు వారిని చితక్కొట్టారు. ఈ ఘటన మెదక్ జిల్లాల తూప్రాన్ మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శివానందం వివరాల ప్రకారం.. కిష్టాపూర్ గ్రామానికి చెందిన పోచయ్య ఇటీవలే మృతి చెందాడు. దీనితో భార్య కమలమ్మ, కోడలు నవనీత, కొడుకు స్వామి, బిడ్డలు, అల్లు్ల్లతో కలిసి పెద్దలకు శనివారం రాత్రి పండగ చేశారు. దీన్ని తప్పుగా భావించిన పక్కింటి వారు.. మంత్రాలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. దీదే విషయమై వారితో గొడవకు దిగారు. ముగ్గురిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మొత్తం పది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed