రేపు ఖమ్మానికి రానున్న కేంద్ర మంత్రి

by M.Rajitha |
రేపు ఖమ్మానికి రానున్న కేంద్ర మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు, వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం ఉదయం వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఖమ్మం జిల్లాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించి వరద నష్టంపై అడిగి తెలుసుకోనున్నారు. అలాగే వరద బాధిత ప్రాంతాలకు బీజేపీ నేతలు సైతం శుక్రవారం వెళ్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు బీజేపీ రెండు బృందాలుగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనలు చేపట్టనుంది. బండి సంజయ్ నేతృత్వంలో ఉన్న బృందం ఖమ్మం, కోదాడ ప్రాంతాల్లో పర్యటించనుంది. ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న బృందం మహబూబాద్, ములుగు ప్రాంతాల్లో పర్యటించనుంది.

Advertisement

Next Story

Most Viewed