- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
గ్రాండ్ నర్సరీ మేళా నిలిపివేసిన పోలీసులు
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోణి నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన గ్రాండ్ నర్సరీ మేళాను పోలీసులు అడ్డుకున్నారు. గురువారం మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఈ 16వ గ్రాండ్ నర్సరీ మేళాను ప్రారంభించగా.. దీనికి విశేష స్పందన వస్తోంది. కాగా ఈ మేళాకు ఎలాంటి అనుమతులు లేవంటూ శుక్రవారం పోలీసులు నర్సరీ ప్రదర్శనను నిలిపి వేశారు. దీంతో నిర్వాహకులు, సందర్శకులు, మొక్కల ప్రేమికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నిన్న మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగినపుడు ఎందుకు అడ్డుకోలేదని మండిపడ్డారు. తాము ప్రతి ఏటా ఇక్కడ నర్సరీ మేళాను నిర్వహిస్తున్నామని, ఎప్పుడూ ఇలా అడ్డుకోలేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 2 వరకు ఈ నర్సరీ మేళా జరగనున్నట్లు నిర్వాహకులు విస్తృత ప్రచారం చేయగా.. మేళాకు భారీగా సందర్శకులు తరలి వచ్చారు. అంతలోనే ప్రదర్శనను పోలీసులు నిలిపి వేయడంతో వారంతా నిరాశగా వెను దిరిగారు.