దారుణం.. అమ్మమను కిరాతకంగా హతమార్చిన మనువడు

by Rajesh |
దారుణం.. అమ్మమను కిరాతకంగా హతమార్చిన మనువడు
X

దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం నగరం రోటరీ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. కాలనీలో నివాసం ఉంటున్న అమరబోయిన రాంబాయి (80) అనే వృద్ధురాలిని మనుమడు ఉదయ్(24) హతమార్చాడు. జల్సాలకు అలవాటుపడి డబ్బులు ఇవ్వకపోవడంతో అమ్మమను హత్య చేసినట్లు తెలిసింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం కూడా చేశాడని స్థానికంగా ఆరోపణలు వినపడుతున్నాయి. స్థానికులు ఉదయ్‌ని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోస్టు మార్టం కోసం మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story