తిరుమలలో ఏనుగుల గుంపు కలకలం.. అరిపిరి సమీపంలో సంచారం

by srinivas |
తిరుమలలో ఏనుగుల గుంపు కలకలం.. అరిపిరి సమీపంలో సంచారం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో గజరాజులు కలకలం రేపాయి. అలిపిరి నడకమార్గం సమీపం మొదటి ఘాట్ రోడ్డులో భక్తులకు దూరంగా ఏనుగుల గుంపు కనిపించింది. అడవుల్లో నుంచి 7వ వద్దకు ఏనుగులు వచ్చాయి. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఘాట్ రోడ్డులోకి వస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు. రోడ్డులో వెళ్తున్న వాహనదారులను ఏమైనా చేస్తాయేమనని ఆవేదన చెందుతున్నారు. అటవీ శాఖ సిబ్బంది వెంటనే స్పందించి ఏనుగులను అటవీప్రాంతంలోకి తరమే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది గజరాజులను అక్కడి నుంచి తరిమేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చీకటి కావడంతో చర్యలు ఆలస్యం అవుతోంది.



Next Story